Posts

Showing posts from June, 2016

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి.

Image
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను నమ్మించి గొంతు కోశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.ఆమె శనివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ....ముఖ్యమంత్రి తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. హామీల అమలుపై  వైఎస్ జగన్ మాట్లాడుతున్నారే కానీ, ఆయన వ్యక్తిగత సమస్యలపై మాట్లాడటం లేదన్నారు. చంద్రబాబు ఇలాగే ప్రవర్తిస్తే ప్రతిపక్ష నేతగా ఆయన ఇంకా గట్టిగా మాట్లాడతారని వాసిరెడ్డి పద్మ అన్నారు.టీడీపీ నేతలు సభ్య సమాజం తలదించుకునేలా వైఎస్ జగన్ ను దూషిస్తున్నారన్నారు. వైఎస్ జగన్ సహనంతో ఉన్నారని అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ప్రజల కష్టంపై మాట్లాడితే హీనాతిహీనంగా విమర్శిస్తారా అని ఆమె ప్రశ్నించారు. సభ్యత, సంస్కారం ఉన్నవారెవరైనా అటువంటి వ్యాఖ్యలు చేస్తారా అని వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నలు సంధించారు.చంద్రబాబును  ఒక్క మాట అన్నందుకే ఇంత కోపం వస్తే జగన్ అన్ని మాటలు అంటుంటే మాకెంత కోపం రావాలని ప్రశ్నించారు.

నితిన్ కు కలసి రాదేమో

Image
తెలుగు చిత్ర పరిశ్రమలో కమర్షియల్ సినిమా అంటే హీరో చుట్టూ తిరుగుతుంటుంది. అందులో హీరోయిన్ ని డామినేషన్ ఏమాత్రం ఉన్న మార్కులన్నీ హీరోయిన్ కే పోతుంది. అ..ఆ సినిమాకు ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా విడుదలకు ముందు నుంచి హీరోయిన్ కు ప్రాధాన్యం ఉన్న సినిమా అనే టాక్ వినిపించింది. విడుదలైన తర్వాత అది నిజమే అని అనిపించింది. సినిమాలో సమంత డామినేషన్ ముందు నితిన్ బొమ్మలా నిలబడిపోయాడు. క్లైమైక్స్ కి ముందు అత్తకు క్లాస్ తీసుకునే సీన్ లో నితిన్ కాకుండా...సామంత చేసుంటే.... ఈ సినిమాలో నితిన్ పాత్ర మరింత తేలిపోయేది. అయితే ఈ సినిమాలో నితిన్ చాలా సేతిల్డ్ గా పెర్ఫోర్మ్ చేసినట్లు అనిపించింది. కొత్తగా కనిపించడానికి శతవిధాల ప్రయత్నించాడు. కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్స్ బాగా పండించాడు. అయితే సినిమాపై త్రివిక్రమ్, సమంతల ముద్ర ఆల్రెడీ ఉండడంతో సినిమా క్రెడిట్ ఆ ఇద్దరి లిస్టులో పడిపోయింది. నితిన్ కెరీర్ లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా చెప్పుకోవడానికే తప్ప నితిన్ కు మిగిలింది ఏమి లేదని అంటున్నారు. దాంతో నితిన్ కెరీర్ కు పెద్దగా కలసి రాదనే చెప్పాలి.